Monday, April 29, 2024

బాపు మంచిగున్నావా… తన తండ్రి దోస్తులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి వేముల.

వేల్పూర్ ఫిబ్రవరి 25 (ప్రభ న్యూస్ ) బాపు మంచిగున్నావా… ఆరోగ్యం బాగుందా అంటూ తన తండ్రి స్నేహితులను ఆప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.శనివారం వేల్పూర్ మండలం లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముగించుకొని హైదరాబాద్ వెళుతుండగా మార్గ మధ్యలో తన తండ్రి స్నేహితులు తరసా పడడంతో మంత్రి కాన్వయ్ ని ఆపారు. వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. తన తండ్రితో వారికి ఉన్న అనుబంధం, ఆప్యాయత గుర్తుచేసుకున్నారు. ఎలాంటి సహకారం కావాలన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా కొడుకులా భావించి తనతో చెప్పాలని సూచించారు. వయసు పైబడిన వారు అందరు ఒకేచోట చేరి మనసులో భావాలు పంచుకునేందుకు వృద్దులకు సంఘభవనం మంజూరు చేస్తానని వారికి ఈ సందర్బంగా మంత్రి హామీ ఇచ్చారు. కొడుకులాంటి మంత్రి తన కాన్వాయ్ ఆపి పలకరించడంతో వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement