Wednesday, May 15, 2024

TS : తెలంగాణ‌కు మాజీ గ‌వ‌ర్న‌ర్… ప‌ది రోజుల పాటు ప్ర‌చారం

తెలంగాణ‌లో మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై పర్య‌టించ‌నున్నారు. ఆమె బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. పది రోజులకు పైగా ఆమె ఇక్కడే ఉండి ప్రచారం చేయనున్నారు.

తమిళనాడు బీజేపీ వలంటీర్లతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అయితే, గవర్నర్​గా రిజైన్ చేశాక తొలిసారి రాష్ట్రానికి ఆమె బీజేపీ నేతగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై ఆమె ఎలాంటి ఆరోపణలు చేస్తారో అందరిలో ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement