Monday, July 22, 2024

TS Minister : శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప సేవ‌లో మంత్రి పొంగులేటి…

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామిని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి నేటి ఉద‌యం ద‌ర్శించుకున్నారు… ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద‌ర్శ‌నానంతరం ఆయ‌న మాట్లాడుతూ… దేశం సుభిక్షంగా ఉండడం కోసం అయ్యప్ప దర్శనం చేసుకోవడం జరిగిందన్నారు.

ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు రావాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని వేడుకోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఇటీవల ఎన్నికల సందర్భంగా తీరికలేని సమయంతో కొంత అలసట, ఒత్తిడి ఏర్పడ్డాయన్నారు. శబరిమలై అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడంతో ప్రశాంతత లభించిందని మంత్రి తెలిపారు.

అయ్యప్ప దర్శనం ఎంతో ఆనందం ఇచ్చిందన్నారు. మంత్రితో పాటు అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకున్న వారిలో భద్రాచలం శాసనసభ్యుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు, పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట శాసనసభ్యుడు జారే ఆదినారాయణ, డీసీసీ చైర్మన్, తుళ్లూరి బ్రహ్మయ్య, డీసీఎంఎస్ చైర్మన్, మువ్వా విజయ్ బాబు, ఎండి నవాబ్ ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement