Friday, July 26, 2024

AP: రేపు కొల్హాపూర్ వెళ్ల‌నున్న చంద్ర‌బాబు

మ‌హ‌రాష్ట్ర‌లో ఒక రోజు ప‌ర్య‌ట‌న‌
కొల్హాపూర్ లో శ్రీ మ‌హాల‌క్ష్మీ ఆల‌యంలో పూజ‌లు
అనంత‌రం షిర్డికి ప‌య‌నం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు స‌తీస‌మేతంగా రేపు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్లనున్నారు. అక్కడి శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం షిర్డీ చేరుకుని సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుంటారు.

కాగా, ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్న చంద్రబాబు ఆ తర్వాత మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి వెళ్లారు. అక్క‌డి నుంచి గ‌త రాత్రి ఆయ‌న హైద‌రాబాద్ కు తిరిగి వ‌చ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement