Saturday, July 27, 2024

Andhra Pradesh – లారీ – బైక్ ఢీ… ఇద్దరు యువకులు మృతి…

ఫిరంగిపురంలోని రేపూడి గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గొల్లపాలెం గ్రామానికి చెందిన గోసాల లూర్దు రాజు, నల్లపాడు గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుంటూరు నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement