Friday, April 26, 2024

మార్చి 3న బ‌ల‌గం…

దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మిస్తోన్న సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ తదితరులు ప్రధాన తారాగణం . వేణు ఎల్దండి దర్శ కత్వం వహించారు. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమా లను పూర్తి చేసుకుంది. మార్చి 3న సినిమా విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. రిలీజ్‌ చేస్తున్నట్లు- తెలియజేశారు.
దిల్‌ రాజు మాట్లాడుతూ ”కొత్త కాన్సెప్ట్‌ సినిమాలను చేస్తూ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ ప్రారంభించాం. అందు లో భాగంగా వేణుతో బలగం సినిమాను చేశాం. తెలం గాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఒక-టె-ండు మినహా మిగిలిన పాత్రలన్నింటిలో కొత్త వారినే తీసుకున్నాం. భీమ్స్‌ సంగీతంలో కాసర్ల శ్యామ్‌ రాసిన పాటలు హృదయాలకు హత్తుకుంటాయి. ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది” అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement