Saturday, April 27, 2024

TS | కాంగ్రెస్‌లోకి మాజీ మేయర్ సుజాత

నిజామాబాద్ (ప్రభ న్యూస్): నిజామాబాద్ మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం (శుక్రవారం) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స‌మ‌క్షంలో మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం, 20 మంది బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిజామాబాదులో బీఆర్‌ఎస్ ఖాళీ అయింది. మాజీ ఎమ్మెల్యే గణేష్ బీగల ముఖ్య అనుచరులు, ప్రధాన క్యాడర్ కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌ నుంచి ఒక్కొక్కరు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ అనంతరం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి మాజీ మేయర్‌ ఆకుల సుజాత శ్రీశైలం, బీఆర్‌ఎస్‌ మాజీ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. కొంత కాలంగా బీఆర్‌ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement