Friday, April 26, 2024

డివైడ‌ర్ ను ఢీకొని ఆర్టీసీ బ‌స్సు బోల్తా… ప్ర‌యాణికుల‌కు స్వ‌ల్ప గాయాలు…

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం వద్ద బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుత‌ప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా ప‌డింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు, బస్సు డ్రైవర్, కండక్టర్ ఉన్నారు. ఎనిమిది మంది ప్ర‌యాణికుల‌కు, డ్రైవర్ కు గాయాల‌య్యాయి. బాధితుల‌ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement