Wednesday, May 8, 2024

అవినీతిపై కవిత మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే.. స్రవంతి రెడ్డి

నిజామాబాద్ సిటీ, జులై 22 (ప్రభ న్యూస్) : అవినీతిపై ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం నిజామాబాద్ నగరంలోని ప్రగతీనగర్ లో గల భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్రవంతి రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అర్వింద్ ని వెంటాడి ఓడిస్తానన్న కవిత ఇప్పుడు మాటలు మార్చి, అరవింద్ మీద ఎవరు నిలబడ్డా బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎంపీ అరవింద్ తాను చేసిన అవినీతి గురించి రుజువు చేయాలని, లేకపోతే పూలాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయలన్న వ్యాఖ్యల మీద ఆమె స్పందిస్తూ… కవిత ఎంపీగా ఉన్నప్పుడు, తండ్రి సీఎంగా ఉన్నప్పటికీ జిల్లాకు కవిత చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.

మాధవ్ నగర్ ఆర్ఓబి పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ ఈమె కమిషన్లకు భయపడి పారిపోయిన మాట వాస్తవం కాదా అని ఆరోపించారు. మాధవ్ నగర్ , ఆర్మూర్ మామిడిపల్లి, అడవి మామిడిపల్లి పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. అర్సపల్లి ఆర్ఓబి కి సైతం 137.5 కోట్లు మంజూరు చేయించుకున్న ఘనత అరవింద్ కే దక్కుతుందన్నారు. ఈడి విడుదల చేసిన సప్లమెంటరీ చార్జిషీట్లో కవిత భర్త అనిల్ కుమార్ పేరు ఉందని, మీడియా సంస్థలు కూడా వీటిని ప్రసారం చేశాయని, అవినీతి చేసిన ప్రతి ఒక్కరూ జైలుకే వెళ్తారని ఎంపీ అర్వింద్ అన్నారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఈసమావేశంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పంచరెడ్డి ప్రవళిక , కార్పొరేటర్లు సౌజన్య, మమత, ఇందిరా, మహిళా మోర్చా నాయకు రాలు వరలక్ష్మీ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement