Sunday, May 26, 2024

మా ఓట్లన్నీ మీకే – మంత్రి ప్రశాంత్ రెడ్డి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం

భీంగల్ టౌన్, సెప్టెంబర్ 3 ( ప్రభన్యూస్ ).నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలంలోని బడా భీంగల్ గ్రామానికి చెందిన మున్నూరు కాపు రాగుల సంఘం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెంటే ఉంటామని, సంఘం మొత్తం సభ్యులు కారు గుర్తుకే ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఆదివారం సంఘం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి కి మద్దతుగా కారు గుర్తు కు ఓటు వేస్తామని సభ్యులు ప్రమాణం చేశారు. సంఘం లో తీర్మానం చేసి సభ్యులు తీర్మానం ప్రతిపై సంతకాలు చేసి సంఘం అధ్యక్షులు రాగుల మోహన్ ద్వారా మంత్రి ప్రశాంత్ రెడ్డికి పంపించారు. మంత్రి చేసిన అభివృద్ధి కి సంఘం అండగా ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement