Monday, April 29, 2024

NZB: ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. బిజెపి అభ్యర్థి ధన్​పాల్​ సూర్యనారాయణ

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్) 7:
నిజామాబాద్ అర్బన్ ను అభివృద్ధి చేసి చూపిస్తా… ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండని బిజెపి అర్బన్ అభ్యర్థి దంపాల్ సూర్యనారాయణ కోరారు.మంగళవారం నిజామాబాద్ నగరం లోని 41 వ డివిజన్ లో చంద్రశేఖర్ కాలనీలో లో బిజెపి అభ్యర్థి దనపాల్ సూర్య నారా యణ, జిల్లా బిజెపి అధ్యక్షులు బస్వా లక్ష్మి నరసయ్య తో కలసి ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. డివిజన్లో మహిళలు ధన్ పాల్ కు పెద్ద ఎత్తున మద్దతు పలికి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్బంగా సూర్యనారాయణ మాట్లా డుతూ 41 వ డివిజన్ లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. నగరం లో మురికికాలువ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. 9 సంవత్సరాల పాలన లో చేసిన అభివృధి ఎం లేదన్నారు నగ రం లో సుందరికరణ పేరిట వేల కోట్లు దోచుకున్నారనీ ఆరోపించారు. ఇప్పటివరకు ఒక్క డబల్ బెడ్ రూమ్ అంద చేయలేదనీ మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వం లో అవినీతి తప్ప అభివృద్ధి లేదన్నారు. నిజామాబాదు అర్బన్ లో పార్టీ కార్యకర్తల కి ప్రజలకు ఎల్ల వేళలా అండగా ఉంటాననీ అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి తో ప్రజలు ఇబ్బంది పడు తున్నారు. బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్ని ఏర్పాటు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రం లో మోదీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథ కాలు ప్రవేశ పెట్టిందన్నారు. ఉచిత రేషన్, కరోనా సమయం లో ఉచిత వాక్సిన్, ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో పథకాలను మోదీ ప్రభుత్వం పేదల కు అవసరమయ్యే పథకాలను తీసుకోని వచ్చా మన్నారు. ఒక్కసారి అర్బన్ లో భారతీయ జనత పార్టీ అభ్యర్థి గా నన్ను ఆశీర్వదించండనీ కోరారు. అవినీతి, కమిషన్ లు లు లేకుండా అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమం లో స్థానిక కార్పొరేటర్ బూరు గుల ఇందిరా వినోద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్, కార్పొరేటర్ ఎర్రం సుదీర్, జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, పవన్ ముందడ, ప్రతాప్ రెడ్డి, బిజెపి నాయకులు డివిజన్ వాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement