Monday, April 29, 2024

Nzb: కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించాలి.. బీజేపీ

నిజామాబాద్ సిటీ, జూన్ 28 (ప్రభ న్యూస్) : పేద ప్రజల కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికి చేరవేయడమే ప్రతి ఒక్క కార్యకర్త లక్ష్యమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. బుధవారం నిజామాబాద్ నగరంలోని 7 డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ సుక్క మధు ఆధ్వర్యంలో గడపగడపకు బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా సమయంలో వ్యాక్సిన్, ఉచిత రేషన్ బియ్యం ఇలాంటి అనేక విషయాలను మోడీ ప్రవేశపెడుతున్నారని ప్రజలే తమకు వివరిస్తున్నారన్నారు. దేశంలో అటువంటి నాయకుడిని ఎప్పు డూ చూడలేమన్నారు. ఇదే విధంగా ప్రతి డివిజన్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రతి ఇంటి తలుపు తడతామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. కుటుంబ పాలన అంతమొందించాలంటే భారతీయ జనతా పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. నిన్న నరేంద్రమోడీ మాట్లాడుతూ… కుటుంబపాలన పోవాలి అంటే బీజేపీకి ఓటెయ్యాలన్నారు. మన పిల్లలు వారి భవిష్యత్తు బాగుండాలంటే మోడీ ప్రభుత్వానికి పట్టం కట్టాలని సూచించారు.

నిజామాబాద్ అర్బన్ లో అభివృద్ధి శూన్యమన్నారు. వేసిన రోడ్లను వేయడం, కట్టిన దాని కూలగొట్టి మళ్ళీ కట్టడం తప్ప అభివృద్ధి ఏం లేదన్నారు. రాష్ట్రంలో స్కామ్ ల ప్రభుత్వం ఏర్పడిందన్నారు. నిజామాబాద్ లో కబ్జాల మీద పాలన సాగిస్తున్నారు. ఎక్కడ భూమి కనబడితే అక్కడ కబ్జా చేస్తుండని, నిజామాబాద్ ఎమ్మెల్యే పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా పేద ప్రజల గురించి భవిష్యత్తు తరాల గురించి ఆలోచన చేయాలని, రాబోయే ఎన్నికల్లో గణేష్ గుప్తాకు నిజామాబాద్ ప్రజలు సరైన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇంచార్జ్ చినకారి నరేష్, బూత్ అధ్యక్షులు నందకి షోర్, రఘువీర్, బట్టి కార్ ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ, గోపిడి వినోద్ రెడ్డి, ఇప్పకాయల కిషోర్, బురుగుల వినోద్ ఇల్లెందుల ప్రభాకర్ మఠం పవన్, దుద్దుల్ల గిరిబాబు, మోహన్, హరీష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కుషాల్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement