Tuesday, April 30, 2024

NZB: గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ నాయకుల మద్దతు

బీర్కూర్, ఆగస్టు 1 ప్రభ న్యూస్ : బీర్కూరు మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి బీర్కూర్ మండల కేంద్రంలోని కామప్ప చౌరస్తా వద్ద గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అన్ని రకాల ఉద్యోగులకు న్యాయం చేస్తున్నారన్నారు. గ్రామపంచాయతీ ఉద్యోగులకు, కార్మికులకు పర్మినెంట్ చేయాలని ప్రజాభిమాన నేత, ప్రజల శ్రేయస్సు కోరే బాన్సువాడ అభివృద్ధి ప్రదాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకి దృష్టికి తీసుకవెళ్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ పంచాయతీ కార్మికులకు 10,000 రూపాయలు, తిమ్మాపూర్ రాంబాబు 2000 రూపాయలు విరాళం అందించారు. దీనిలో భాగంగా బరంగ్ ఎడ్గి సర్పంచ్ పంచాయతీ కార్మికులకు అరటి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘు, మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్, ఎంపీటీసీ సందీప్ పటేల్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఆవారి గంగారం, కో ఆప్షన్ ఆరిఫ్, కిష్టాపూర్ సర్పంచ్ పుల్లని బాబురావు, చించొల్లి సర్పంచ్ పెరిక పెద్ద అంబయ్య, తిమ్మాపూర్ రాంబాబు, బరంగ్ ఏడ్గి పసుపుల రమేష్, అన్నారం సర్పంచ్ కృష్ణారెడ్డి, లాడెగమా గంగాధర్, లాయక్ పటేల్, పడ్తెపు నారాయణ,దుంపల రాజు, కొరిమి రఘు, నర్ర సాయిలు తదితర మండల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement