Wednesday, May 15, 2024

ఇంద్ర‌కీలాద్రిపై వైభవంగా గిరి పౌర్ణమి ప్రదక్షిణలు..

విజయవాడ ప్రభ న్యూస్ – పౌర్ణమి సందర్భముగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో లోకకళ్యాణార్థం, భక్త జనశ్రేయస్సు కొరకు ధర్మప్రచారం నిమిత్తం ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ న వైభవంగా నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన గురి ప్రదక్షనలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కర్నాటి రాంబాబు ఈవో భ్రమరాంబ, ట్రస్ట్ సభ్యులు మాధవి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్చరణలు, అమ్మవారి నామ స్మరణలు, మంగళ వాయిద్యముల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం(ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద) వద్ద శ్రీ స్వామి

, అమ్మవార్లుకు ఆలయ వైదిక సిబ్బంది శాస్త్రోక్తముగా పూజలు నిర్విహించగా మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొని గిరి ప్రదక్షిణ కార్యక్రమం ను ప్రారంభించారు.

గిరిప్రదక్షిణ కార్యక్రమము శ్రీ కామధేను అమ్మవారి ఆలయము, కుమ్మరిపాలెం సెంటర్, నాలుగు స్థంబాల సెంటర్, సితార, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టి నగర్, కొత్తపేట, నెహ్రు బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా డప్పులు తదితర సాంస్కృతిక కార్యక్రమముల నడుమ తిరిగి ఆలయమునకు చేరుకున్నారు. గిరిప్రదక్షిణ మార్గము నందు భక్తులు ప్రచార రథము లో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు, స్వామి వార్లకు భక్తిశ్రద్దలతో పూలు, పండ్లు, కొబ్బరికాయ లు సమర్పించి, పూజలు చేసి, అమ్మవారిని, స్వామి వారిని ప్రార్థించి, అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement