Wednesday, May 8, 2024

ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి.. ఆస్పత్రి ఎదుట ఆందోళన..

ఇంజక్షన్ వికటించి నాలుగు నెలల బాలుడు మృతిచెందాడ‌ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి ముందు ఆందోళన నిర్వ‌హించారు. నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలం లింబాద్రి గుట్టకు చెందిన వేముల కార్తీక్ (4 నెలలు) ఇంజక్షన్ వికటించి మృతి చెందినట్లు ఆరోపిస్తూ ప్రభుత్వ ఆస్ప‌త్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. లింబాద్రి గుట్టకు చెందిన వేముల రమ్య తన నాలుగు నెలల కుమారుడుకి ఈనెల 24న బాబాపూర్ సబ్ సెంటర్ లో ఐపీవీ ఇంజక్షన్ రెండో డోస్ ఇప్పించారు. ఇంజక్షన్ ఇప్పించిన మరుసటి రోజు ఉదయం బాబు చనిపోయాడు. ప్రభుత్వ ద‌వాఖాన సబ్ సెంటర్ లో ఇచ్చిన ఇంజక్షన్ ద్వారానే బాబు మృతి చెందాడని అగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు ఆస్ప‌త్రి ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement