నిజామాబాద్, (ప్రభ న్యూస్) : విచక్షణా రహితంగా కన్న తల్లిపై దాడి చేసిన కర్కషా కుమారుడిని రిమాండ్కు తరలించారు. జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్లో బంగారం, ఫించన్ డబ్బుల కోసం తల్లి గంగామణి కొట్టిన కుమారుడు పవన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గంగామణికి ఇద్దరు కుమారులు శ్రీనివాస్, పవన్ ఉన్నారు. అయితే నాలుగు నెలల క్రితం శ్రీనివాస్ మృతి చెందాడు. తల్లి గంగామణి తన ఆస్తిని ఇద్దరు కొడుకులకు కట్టబెట్టింది. ప్రస్తుతం పెద్ద కొడుకు ఇంట్లో గంగామణి ఉంది. ఈ నెల 17న గంగమ్మ వద్ద ఉన్న బంగారం, పించన్ డబ్బులు ఇవ్వాలని చితకబాదాడు. మనువడు మనోజ్ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.