Wednesday, May 15, 2024

IPL 2024 | ఉప్ప‌ల్ మ్యాచ్‌లకు పటిష్ట ఏర్పాట్లు : రాచకొండ సీపీ

మరో మూడు రోజుల్లో (ఈ నెల 22 నుంచి) ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ విడుదల కాగా, ఇవి జరుగుతుండగానే రెండో షెడ్యూల్ కూడా విడుదల కానుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా కొన్ని మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. మార్చి 27న ఉప్పల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక్కడ నిర్వహిస్తున్న క్రికెట్ మ్యాచ్‌లపై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సమావేశం నిర్వహించారు. భద్రతతో పాటు ఇతర ఏర్పాట్లను కూడా ఆదేశించారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌ల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు, భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ తరుణ్ జోషి అధికారులకు సూచించారు. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని అన్నారు. టిక్కెట్ల పంపిణీలో ఎలాంటి గందరగోళం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.

స్టేడియంలో ప్రేక్షకులకు అవసరమైన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. సామాన్య వాహనదారుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ పోలీసులకు పలు సూచనలు చేశారు. ఉప్పల్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనదారులకు ముందస్తుగా సూచనలు చేయాలని తెలిపారు. అలాగే స్టేడియం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సక్రమంగా పనిచేసేలా చూడాలని కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement