Sunday, May 19, 2024

Alliance | తమిళనాడులో పీఎంకేతో బీజేపీ పొత్తు

లోక్‌సభ ఎన్నికల కోసం తమిళనాడులో పట్టాలి మక్కల్ కచ్చి (పీఎంకే) పార్టీతో బీజేపీ పొత్తు ఖరారైంది. దేశ ప్రయోజనాల కోసం, ప్రధాని మోదీ పాలన కొనసాగింపు కోసం ఎన్డీయే శక్తులతో చేతులు కలపాలని నిర్ణయించుకున్నట్లు పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ మంగళవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. సీట్ల సర్దుబాటు ఒప్పందంలో భాగంగా బీజేపీ తమిళనాడులోని 10 లోక్‌సభ స్థానాలను పీఎంకేకి కేటాయించింది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై అసంతృప్తితో ఉన్న తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తమిళనాడులో తమ కూటమి భారీ విజయం సాధించి ప్రధాని మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమం చేస్తుందని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీయేతో కలిసి పోటీ చేయాలన్న పీఎంకే నిర్ణయం దేశవ్యాప్తంగా 400కు పైగా ఎంపీ స్థానాల్లో పోటీ చేసే కూటమి అభ్యర్థుల విజయానికి దారితీస్తుందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలై ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement