Thursday, May 16, 2024

T20 World Cup :కివీస్‌కు కేన్ మామే కెప్టెన్…

జూన్‌లో టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ జరగనుంది. వెస్టిండీస్-అమెరికా దేశాలు ఈసారి ఆతిధ్యమిస్తున్నాయి. వెస్టిండీస్‌లో ఎక్కువ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక అమెరికాలో స్టేడియం నిర్మాణాల పనులు వేగంగా సాగుతున్నాయి. అందులో పాల్గొనే దేశాలు తమతమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఈ జాబితాలోకి న్యూజిలాండ్ కూడా చేరిపోయింది. ఆదేశ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. కేన్ విలియమ్సన్‌కు కెప్టెన్ పగ్గాలు అప్పగించింది.

- Advertisement -

జట్టులోని ఆటగాళ్ల విషయానికొస్తే.. అలెన్, బౌల్ట్, బ్రేస్‌వెల్, చాప్మన్, కాన్వే, ఫెర్గూసన్, హెన్రీ, డారిల్ మిచెల్, నీషమ్, ఫిలిప్స్, రవీంద్ర, సాంట్నర్, సోథి, సౌథీ ఈ జట్టులోకి ఆటగాళ్లు. ఇందులోని సగానికి పైగా ఆటగాళ్లు ఇండియాలో జరుగుతున్న ఐపీఎల్ 2024లో ఆడుతున్నారు. టోర్నీ ముగియగానే ఆటగాళ్లు ఇక్కడ నుంచి నేరుగా న్యూజిలాండ్‌కు వెళ్లనున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ టూర్‌లో కేన్ విలియమ్సన్ టీమ్.. ఐదు టీ20 సిరీస్‌ను 2-2 సమం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement