Wednesday, May 15, 2024

Bangladesh VS India : తొలి టి 20 మ‌న‌దే…

బంగ్లాదేశ్ – భార‌త‌ పేసర్లు రేణుకా సింగ్‌ (3/18), పూజా వస్త్రాకర్‌ విజృంభించడంతో.. బంగ్లాదేశ్‌ టూర్‌లో భారత మహిళల జట్టు బోణీ చేసింది. ఆదివారం జరిగిన తొలి టీ20లో భారత్‌ 44 పరుగుల తేడాతో బంగ్లాపై నెగ్గింది. తొలుత భారత్‌ 20 ఓవర్లలో 145/7 స్కోరు చేసింది.

యాస్తిక (36), షఫాలీ వర్మ (31), హర్మన్‌ప్రీత్‌ (30) రాణించారు. రబయా 3 వికెట్లు పడగొట్టింది. ఛేదనలో బంగ్లా ఓవర్లన్నీ ఆడి 101/8 స్కోరు మాత్రమే చేసింది. రేణుకా సింగ్‌ 3, పూజ 2 వికెట్లు పడగొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement