Tuesday, May 7, 2024

నిజామాబాద్ కలెక్టరేట్ లో వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ సిటీ :నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ లో ఎల్లమ్మ గుట్ట ప్రాంతానికి చెందిన ఒడ్డేపు రుకుంబాయి అనే వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈరోజు నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతానికి చెందిన రుకుంబాయీ అనే వృద్ధురాలు తనకు సంబంధించిన ఆస్తి విషయంలో న్యాయం జరగడం లేదని విరక్తి చెంది తన వెంట తెచ్చుకున్న తాడుతో కలెక్టరేట్ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకునే ప్రయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన కలెక్టరేట్ పోలీసులు ఆమెకు బిగుసుకున్న తాడుని తీసివేసి ఆమెను కాపాడారు.

వెంటనే సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. రుకుంబాయి తన బాధను కలెక్టర్ తో మొరపెట్టుకుంది. ఈ సందర్భంగా వృద్ధురాలు మాట్లాడుతూ.. ఎల్లమ్మ గుట్ట ప్రాంతానికి చెందిన తన ఇల్లును కొడుకు సాగర్ తనకు తెలియకుండా తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని వాపోయింది. ఈ విషయమై సంవత్సర కాలంగా ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా.. ఫలితం లేదని వాపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టి తనకు సంబంధించిన ఆస్తిలో సగభాగం తనకు ఇచ్చి న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరింది. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement