Monday, April 29, 2024

కరీంనగర్ లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నాయ‌కులు పాల్గొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం, సాయుధ బలగాల పూర్వ సంప్రదాయాలు, నైతికతలను తారుమారు చేస్తూ, వారి మనోధైర్యాన్ని దెబ్బ తీసే విధంగా ప్రకటించిన అగ్నిపథ్ పథకం పై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున యువకులు సైనిక అభ్యర్థుల ఆగ్రహానికి, నిరసనలకు దారితీసింది.

ఈ కేంద్ర ప్రభుత్వ అనాలోచిత పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని ఏఐసీసీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఉద‌యం 10:00 గం.ల నుండి మ.01:00 గం.ల వరకు కరీంనగర్ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద శాంతియుత సత్యాగ్రహం చేపట్టడం జరిగింది. వెంట‌నే అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని ర‌ద్దు చేయాల‌ని వారు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement