Tuesday, May 14, 2024

యాదాద్రిలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈనెల 4వ తేదీన స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 14వ తేదీన అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి. ఆదివారం మూడో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని మత్స్యావతార అలంకారంలో సేవ పై నయనమనోహరంగా అలంకరించి వేదమంత్రాలు, వేదపారాయణలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా బాలాలయంలో ఊరేగించి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.10వ తేదీన ఎదుర్కోలు‌, 11న తిరుకల్యాణం, 12 రథోత్సవం నిర్వహించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement