Friday, April 26, 2024

అభివృద్ధికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తాన‌న్న‌ ఎమ్మెల్యే వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127వ డివిజన్ పరిధికి చెందిన ఆదర్శ్ నగర్ సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్లు, కరెంటు స్థంబాలు, పారిశుధ్య నిర్వహణ వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలనీ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఏ.శంకరయ్య, దుర్గ, నాంచారమ్మ, నాగభూషణం, కోటేశ్వర రావు, నారాయణ, దుర్గాభవాని, జే.శ్రీనివాస్, కృష్ణదాస్, ఎస్.శ్రీనివాస్, రఫీయుద్దీన్, రాజ్ కిరణ్, గంగయ్య, పార్థసారధి, హెచ్.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement