Friday, April 26, 2024

ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీపీ, జ‌డ్పీటీసీ, ఎంపీటీసీలు


గుమ్మడిదల, ( ప్రభ న్యూస్): ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో గుమ్మడిదల మండలం ఎంపీపీ సద్ది ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి, జ‌డ్పీటీసీ కుమార్ గౌడ్, గుమ్మడిదల మండలం ఎంపీటీసీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి తమ ఓటును వినియోగించుకున్నారు. మహిళా ఎంపీటీసీలు, ఎంపీపీ, జ‌డ్పీటీసీలంతా కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకొచ్చారు. స్థానిక శాసన మండలి ఎన్నికల్లో తెరాస అభ్యర్థి మర్రి యాదవరెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement