Tuesday, April 23, 2024

Murder: భార్యను చంపిన భర్త

హైదరాబాద్‌ శివార్లలోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. అనుమానంతో కట్టుకున్న భార్యను హత్యచేశాడో భర్త. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమ్రిన్‌, పర్వేజ్‌లు అనే దంపతులు రాజేంద్రనగర్‌లోని ఇమాద్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, భార్యపై అనుమానం పెంచుకున్న పర్వేజ్‌.. తరచూ ఆమెతో గొడవపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇద్దరి మధ్య  గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో సమ్రిన్‌ మెడకోసి హత్య చేశాడు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement