Friday, April 26, 2024

త్వరలోనే వస్తా: ఎమ్మెల్యే సీతక్క ట్వీట్

కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే సీతక్క ఇటీవల అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలైన సంగతి తెలిసిందే. కాగా ఎమ్మెల్యే సీతక్క తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో గిరిజన దండోరా యాత్ర సందర్భంగా సొమ్మసిల్లి పడిపోయిన సీతక్కను కాంగ్రెస్ నాయకులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలో సీతక్క ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించారు. సమస్యలపై త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తానని పేర్కొన్నారు. “నా ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ దేశవ్యాప్తంగా సందేశాలు వచ్చాయి. చాలామంది నన్ను స్వయంగా పరామర్శించి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు” అని ఆమె పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: వాట్సాప్ యూజర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్

Advertisement

తాజా వార్తలు

Advertisement