Wednesday, April 17, 2024

మహారాష్ట్రలో దారుణం.. 15 బాలికపై 29 మంది అత్యాచారం!

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజా మహారాష్ట్ర ఠాణెలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దోంబివల్లిలోని భోపర్​ ప్రాంతంలో 15 ఏళ్ల బాలికపై 29 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 మందిని అరెస్ట్​ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జనవరి 22న జరిగింది. అనంతరం బ్లాక్​మెయిల్​కు పాల్పడ్డాడు. వీడియోలను అడ్డుపెట్టుకుని అప్పటి నుంచి 29 మంది.. దోబివల్లి, బద్లాపుర్​, ముర్బాద్​, రాబెల్​ ప్రాంతాల్లో అత్యాచారానికి ఒడిగట్టారు. నిందితులందరిపై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), 376 (N), 376 (3), 376 (D) (A), పోక్సో  చట్టం కింద నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: బెంగళూరులో భారీ పేలుడు.. ముగ్గురు మృతి

Advertisement

తాజా వార్తలు

Advertisement