Friday, April 26, 2024

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు: పెద్దపల్లి ఎమ్మెల్యే

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు ప్రారంభించామని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నిత్యం ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లను పోలీస్, మున్సిపల్, రోడ్లు భవనాల శాఖ, రవాణా శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నిత్యం రోడ్డు ప్రమాదాల వల్ల ఎందరో మృత్యువాత పడటంతో పాటు క్షతగాత్రులు అవుతున్నారన్నారు. ప్రమాదాల నియంత్రణ కోసం బ్లాక్ స్పాట్ ల వద్ద రక్షణ చర్యలు చేపడతామన్నారు. మంథని ఫ్లైఓవర్ వద్ద రహదారి అత్యంత ప్రమాదకరంగా తయారైందని వెంటనే రోడ్డు వెడల్పు పనులను చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement