Tuesday, May 7, 2024

పాలేరులో రైతు వేదిక ప్రారంభం

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి ఎమ్మెల్యే కాందాల ఉపేందర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. నూతనంగా నిర్మించిన రైతువేధికను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి, జిల్లా కలెక్టరేట్ గౌతమ్,జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement