Sunday, May 19, 2024

ఈనెల 10 నుంచి 12 వరకు శ్రీపద్మావతి పరిణయోత్సవాలు

తిరుమల, ప్రభన్యూస్‌ : శ్రీపద్మావతిశ్రీనివాసుల పరిణయోత్సవాలు ఈనెల 10 నుంచి 12 వరకు తిరుమలలో ఘనంగా జరగనున్నాయి. నారా యణగిరి ఉద్యాన వనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభ వంగా నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలలో తొలిరోజు శ్రీమలయప్పస్వామివారుు గజవాహనం, రెండవ రోజు అశ్వ వాహనం, చివరిరోజు గరుడ వాహనం పై వేం చేపు చేస్తారు. మరో పక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకిలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తురువాత కళ్యాణమహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
శ్రీపద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా మే 10 నుంచి 12 వ తేది వరకు అర్జిత బ్రహ్మోత్సవం, సహ స్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement