అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ దంచికొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటిం చేసిన ఢిల్లీ.. రాజస్థాన్ బౌలర్లను ఉతికారేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు బాదింది. యంగ్ ప్లేయర్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ (50) మరోసారి రాణించాడు. ప్రతీ మ్యాచ్లో మొదటి నుంచే దంచికొడుతూ.. ఢిల్లీ క్యాపిటల్స్కు మంచి ఆరంభం అందిస్తున్నాడు. ఆ తరువాత ఓపెనర్ అభిషేక్ పొరెల్ (65) విధ్వంసం సృష్టించాడు. ఈ సీజన్లో తొలి అర్ధ శతకం బాదేశాడు. ఇక ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (41) చెలరేగాడు. దీంతో ఢిల్లీ స్కోర్ భారీగా వెల్లింది.
ఇక రాజస్థాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజువేంద్ర చాహల్ చెరో ఒక్క వికెట్ దక్కించుకున్నారు. కాగా, 221 పరుగుల టార్గెట్తో రాజస్థాన్ ఛేజింగ్కు దిగనుంది.