Saturday, April 27, 2024

అధిక వర్షాలపై అధికారులతో – మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష

అధిక వర్షాలు కురుస్తోన్న నేపధ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. జిల్లాలోని 1071 చెరువులకు తాజాగా కురుస్తున్న వర్షాలకు 359 చెరువులు అలుగు పోస్తున్నాయని ఆయన వివరించారు. మిగిలిన 712 చెరువులకు వరద నీరు చేరి ఇప్పుడిప్పుడే అలుగు పొసే స్టేజికి చేరుకున్నాయన్నారు.గడిచిన మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా జోరుగా కురుస్తున్న వర్షాల నేపద్యంలో మంగళవారం మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాలు మొదలైన రోజు నుండే సూర్యాపేట జిల్లా కేంద్రంలో మకాం వేసిన మంత్రి జగదీష్ రెడ్డి పెరుగుతున్న వర్షాలకు అనుగుణంగా మూడు జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్ లో మానిటరింగ్ చేస్తున్న విషయం విదితమే. ఇదే క్రమంలో రాష్ట్ర వాతావరణ శాఖ సూర్యాపేట,నల్లగొండ,తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో హై ఎలర్ట్ ప్రకటించడంతో పాటు సోమవారం రాత్రి పొద్దు పోయాక స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి జగదీష్ రెడ్డి తో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం నల్లగొండ, భోనగిరి యాదాద్రి జిల్లాల అధికారులతో ఫోన్ లో పరిస్థితులు అడిగి తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి .. హై ఎలర్ట్ అని భావిస్తున్న సూర్యాపేట జిల్లా అధికారులతో పరిస్థితులను సమీక్షించారు. ప్రజలను ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తూనే అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అన్నింటికి మించి జోరుగా కురుస్తున్న వర్షాల నేపధ్యంలో అంటూ రోగాలు ప్రభలకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.అదే సమయంలో రీస్క్యూ టీంలతో విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉండేలా ఆయన అధికారులను ఆదేశించారు.మూసికి వరద ఉదృతం ఆయిన నేపద్యంలో పంట కాలువలకు నీటిని విడుదల చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.నీటి విడుదల నేపధ్యంలో మూసి పరీవాహక ప్రాంతాన్ని అప్రమత్తం చెయ్యాలని అధికారులకు ఆయన సూచించారు.ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్ పి రాజేంద్రప్రసాద్ లతో పాటు నీటిపారుదల, పంచాయతీ రాజ్,రోడ్లు,భవనాలు,వ్యవసాయ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement