Thursday, April 25, 2024

krishna: అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే పార్థసారథి

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పల హారిక అధ్యక్షతన కొనసాగింది. ఈ సమావేశానికి పెనమలూరు శాసనసభ్యులు పార్థసారథి, సింహాద్రి రమేష్, ఎమ్మెల్సీలు, జడ్పిటిసిలు, ఎంపీపీ, అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు పార్థసారథి అధికారులపై మండిపడ్డారు. రైతులకు సమాచారం లేకుండా ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అందటం లేదని వారికి తెలియటం లేదని, అధికారులు తీరు మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో అధికారులు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement