Saturday, May 4, 2024

ఆలయాల్లో చోరీలు….. భయాందోళనలో ప్రజలు.

… సీసీ కెమెరాలు ఉన్నా ఫలితం శూన్యం
… పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న ఆగని దొంగతనాలు
.. రామాయంపేట పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం మల్లన్న దేవాలయంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు గల్లాపెట్టె ఎత్తుకెళ్లి నగదు అపహరించారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రతి సంవత్సరం జాతర సమయంలో పొండి లెక్కిస్తారు అయితే ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు గుడిలోని సుమారు నాలుగు తాళాలు పగలగొట్టి అందులో ఉన్న గల్లాపెట్టె ఎత్తుకెళ్లారు అందులో ఉన్న నగదు అపహరించి గదిలో పెట్టి కొద్ది దూరంలో పాడేసి వెళ్లారు అలాగే ఆశ గుట్ట మల్లన్న దేవాలయంలో తాళాలు పగులగొట్టి చోరికి యత్నించిన అందులో లేకపోవడంతో దుండగులు తాళాలు పగులగొట్టి వెళ్లిపోయారు పోలీసులు అర్ధరాత్రి పూట పెట్రోలింగ్ చేసిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన దొంగలకు మాత్రం అవేమీ అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ఈ విషయంలో స్థానికులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు పోలీస్ సైరన్ వేసుకొని రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తున్న కనీసం దొంగతనాలు కూడా అరికట్టలేకపోతున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సిసి కెమెరాలు ఉన్నప్పటికీ అందులో కొన్ని దూర ప్రాంతంలో ఉన్న వారిని సరిగా గుర్తించలేకపోతారు ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు ఏదేమైనా దొంగతనాలు విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement