Monday, May 6, 2024

ఏసు క్రీస్తు బోధనలు అనుసరణీయం : ఎమ్మెల్యే జీఎంఆర్

పటాన్ చెరు : కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలోని పిఎన్ ఆర్ కాలనీ, పటాన్ చెరు డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏసు క్రీస్తు బోధనలు అనుసరణీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ పరమత సహనం పాటించాలని అన్నారు. ఈనెల 22వ తేదీన పటాన్ చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఇంద్రేశం గ్రామ సర్పంచ్ నర్సింలు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement