Sunday, May 19, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో విజయం.. ఫోర్బ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాగ‌జైన్ లో క‌థ‌నం

ప్రఖ్యాత ఫోర్బ్స్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో ఎంపీ జోగినపల్లి సంతోష్ చేప‌ట్టిన‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మీద ప్రత్యేక కథనాన్ని ప్ర‌చురించారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కష్టానికి ఫలితం దక్కింది. . మొక్కలు ఎంత ఎక్కువగా పెంచితే పర్యవరణం అంత రమణీయంగా ఉంటుందని, స్వచ్చమైన ఆక్సీజన్ తో పాటు పర్యావరణం కూడా పచ్చగా ఉంటూ ఉత్తేజాన్ని కలిగిస్తుందనే లక్ష్యంతో ఎంపీ సంతోష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలోని అనేక మంది ప్రముఖులు, కళాకారులు, క్రీడారంగ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతోష్ ఛాలెంజ్ ను స్వీకరించి మరొకరికి ఇదే ఛాలెంజ్ ని విసిరిని సందర్బాలు అనేకం ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement