Wednesday, April 24, 2024

Breaking: సిరిసిల్ల షాలినీ కిడ్నాప్ కేసులో ట్విస్ట్

తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన షాలినీ కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. షాలినీ పెళ్లి చేసుకుని వీడియో విడుదల చేసింది. తననెవరూ కిడ్నాప్ చేయలేదని షాలినీ తెలిపింది. ఇష్టపూర్వకంగానే జానీతో వచ్చేశానని తెలిపింది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే జానీతో వచ్చానని, జానీ, తాను నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని పేర్కొంది. తన తల్లిదండ్రుల నుంచి తనకు ప్రాణభయం ఉందని తెలిపింది.

తనని కిడ్నాప్ చేసిన వ్యక్తి, తాను ప్రేమించిన వ్యక్తిని మాస్కు ధరించడం వల్ల గుర్తుపట్టలేకపోయానని తెలిపింది. ఇందులో ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని క్లారిటీ ఇచ్చింది. యువకుడితో కలిసి ఉన్న పెళ్లి ఫోటోలు రిలీజ్ చేసింది శాలిని. యువతి పెళ్లి చేసుకొని వీడియో రికార్డులను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. ఇష్టపూర్వకంగానే ఙ్ఞానేశ్వర్‌(జానీ)తో వెళ్లిపోయానని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదూ.. పెళ్లి కూడా చేసుకున్నానని.. ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసింది. మరో వైపు జానీ అనే యువకుడే తన బిడ్డను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లాడంటూ యువతి తల్లి కన్నీరు మున్నీరయ్యింది. తన బిడ్డను క్షేమంగా తీసుకురావాలని ప్రాధేయపడింది. తనను కొట్టి యువతిని బలవంతంగా లాక్కెళ్లారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి తమ బిడ్డను కాపాడాలని వేడుకొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement