Saturday, April 27, 2024

వేసవిలో నీటి సమస్య..

శివ్వంపేట : వేసవిని దృష్టిలో ఉంచుకొని ఏ గ్రామంలోనైనా నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని ఎంపిపిల ఫోరం జిల్లా అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ అన్నారు. మండలంలోని గంగాయిపల్లి గ్రామంలో సర్పంచ్‌ బండారి శ్యామల వెంకటేష్‌, మండల ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ నవ్యతో కలిసి మంచినీటి సమస్య పరిష్కారానికి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ అధికారులు ఎప్పడికప్పుడు నీటి సమస్య గురించి గ్రామపంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. గ్రామాలలో పైపులైన్‌ చిన్న, చిన్న లీకేజీలు మరమ్మత్తులు ఉంటే వెంటనే వాటిని సరిచేయాలన్నారు. అనంతరం సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, మాజీ ఉపసర్పంచ్‌ తాటి పవన్‌గుప్త, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement