Thursday, March 28, 2024

తప్పనిసరిగా కోవిడ్‌ టీకా ..

కుత్బుల్లాపూర్‌ : మున్సిపల్‌లో పని చేసే ప్రతిఒక్కరు తప్పనిసరిగా కోవిడ్‌ -19 టీకా రెండు డోసులు తీసుకోవాలని కమీషనర్‌ పి. భోగిశ్వర్లు అన్నారు. దుండిగల్‌లో పని చేస్తున్న పారిశుద్ద్య సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. కరోనా రెండోవ దశలో ఉన్నందున కోవిడ్‌ టీకాలను తప్పనిసరిగా తీసుకోని కరోనా బారి నుండి పడకుండా కాపాడవచ్చునన్నారు. కోవిడ్‌ 19 టీకా వచ్చే అపోహలు నమ్మవద్దని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ ఆనంద్‌కుమార్‌, మున్సిపల్‌ ఇంజనీర్‌ పి. ప్రవీణ్‌కుమార్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఓపెన్‌ జీమ్‌ పరిసరాలను పరిశీలన..
దుండిగల్‌ మున్సిపల్‌ పరిధిలో చేపట్టబోయే ఓపెన్‌ జీమ్‌లకు కావాల్సిన పరికరాల క్వాలిటిని కమీనషనర్‌ఒ పి.భోగిశ్వర్లు మున్సిపల్‌ ఇంజనీర్‌ పి. ప్రవీణ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement