Saturday, April 27, 2024

గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య..

ప‌టాన్ చెరు : విద్యార్థులపై పర్యవేక్షణ లోపించడంతో ఓ నిండు ప్రాణం బలైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్ర సమీపంలోని గిరిజన గురుకుల పాఠశాలలో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో 8వ తరగతి చదివే మలావత్ శైలేందర్ అనుమానాస్పద స్థితిలో తరగతి గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మండలంలో సంచలనం రేపింది. అభం శుభం తెలియని ఎనిమిదో తరగతి చదివే విద్యార్థి ఇంతటి దారుణానికి ఒడిగట్టడంపై సర్వత్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి మానసిక స్థాయి కారణంగా జరిగిందా లేదా ఆత్మహత్యకు మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు ఘటన స్థలంలో విచారణ నిర్వహించి విద్యార్థి బాడీని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement