Thursday, April 25, 2024

Breaking : ఏనుగుల బీభత్సం.. రైతులపై దాడి.. ఇద్ద‌రికి గాయాలు..

విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వ‌తీపురంలోని ప‌నుకువ‌ల‌స ద‌గ్గ‌ర ఏనుగుల గుంపు బీభ‌త్సం సృష్టించాయి. పొలంలో ప‌నిచేసుకుంటున్న ఇద్ద‌రు రైతుల‌పై ఏనుగులు దాడి చేశాయి. వెంట‌నే స్థానికులు ఏనుగుల‌ను చెద‌ర‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ఘ‌ట‌న‌లో తండ్రి, కొడుకుల‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంట‌నే వీరికి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఏనుగుల గుంపు సంచారంపై స్థానికులు భ‌యాందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఏనుగుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement