Sunday, May 19, 2024

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – ఎమ్మెల్యే వివేకానంద్

కుత్బుల్లాపూర్ – 125 గాజుల రామారం డివిజన్ పరిధిలోని రావి నారాయణరెడ్డి నగర్ జిబి ఎంక్లేవ్ కాలని వాసులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో డ్రైనేజీ, మంచి నీటి పైపు లైన్లు, దోమల నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే కి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.. కాలనీలో మిగిలి ఉన్న పనులు సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కుమార్, మల్లికార్జున్ యాదవ్, మహిళా నాయకురాలు సంధ్యా రెడ్డి, సుకన్య, లక్ష్మీ, కోటయ్య, నాజర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement