Sunday, May 26, 2024

మీర్జాపూర్ కి సాయిపల్లవి… మున్నాభాయ్ ఆఫర్

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలపై మీమ్స్, ట్రోల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా సాయి పల్లవి పై మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఫిదా సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇక ప్రస్తుతం రానా హీరోగా తెరకెక్కుతున్న విరాట పర్వం సినిమాలో నటిస్తుంది. దీనీతో పాటు మరి కొన్ని సినిమాలో కూడా నటిస్తుంది.

అసలు విషయం ఏంటంటే ఫిదా సినిమాలో బాడుకో బలిసిందా అంటూ ఎంట్రెన్స్ ఇచ్చింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన విరాట పర్వం ట్రైలర్ లో దొంగ లం** అంటూ డైలాగ్ చెప్పింది. ఇక ఈ రెండింటిని జత చేసిన నెటిజన్లు ఫన్నీ మీమ్స్ పెడుతున్నారు. మీర్జాపూర్ లో నటించిన మున్నాభాయ్ ఫోటో పెట్టి బండెక్కు అంటూ మీర్జా పూర్ వెళ్దాము అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement