Thursday, May 16, 2024

మల్లన్న స్వామి ఆశీస్సులు అందరి పైన ఉండాలి : నీలం మధు ముదిరాజ్

రామచంద్రాపురం : శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని, ప్రజలను చల్లగా చూడాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమెలలో ఆదివారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతరకు ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు విచ్చేసిన నీలం మధు ముదిరాజ్ కు ఘన స్వాగతం పలికి డప్పు వాయిద్యాల మధ్య ఆలయ ప్రాంగణంలోకి తీసుకెళ్ళి ప్రత్యేక పూజలు చేయించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. నిత్యం కొలిచే మల్లన్న స్వామి పటాన్చెరు నియోజకవర్గ ప్రజలను సుఖ సంతోషాలతో తులతూగేలా అభివృద్ధి పథంలో నడిపించాలని ఆ స్వామిని కోరుకున్నట్లు చెప్పారు. ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సుచిత్ర కొమరయ్య, రవీందర్రెడ్డి,బాలకృష్ణ ,వెంకటేష్ ,కృష్ణ ,శ్రీనివాస్, రాజు, తోటల సత్తి ,సురేష్, విశ్వనాథ్ ,ఈగ రాజు,సిద్దు,శ్రీకాంత్, గ్రామ పెద్దలు, ప్రజలు ఎన్.ఎం.ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement