Friday, May 3, 2024

దుండిగ‌ల్ లో వ్య‌క్తి అనుమానాస్ప‌ద మృతి..

దుండిగ‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో పూర్తిగా కాలిపోయిన శ‌వం ల‌భ్య‌మైంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. బహుదూర్ పల్లి సాయినాథ్ సొసైటీ నిర్మానుష్య ప్రదేశంలో ఉదయం వాకర్స్ కాలిపోయిన మృతదేహాన్ని చూసి వెంట‌నే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘ‌ట‌న స్థలానికి చేరుకున్న దుండిగల్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో పెట్రోల్ పోసుకొని కాలిపోయిన స్థితిలో వ్యక్తి మృతదేహం ప్రక్కనే మోటర్ భైక్ పూర్తిగా కాలిపోయి ఉన్నట్లుగా గుర్తించారు. భైక్ నెంబరు ఆధారంగా మృతుడు IDA బొల్లారంకు చెందిన తారకేష్ (45) గా గుర్తించారు. బంధువులకు పోలీసులు సమాచారమిచ్చారు. అక్కడికి వచ్చిన కుమారుడు చింటూ తండ్రిని గుర్తించాడు. నిన్న సాయంత్రం ఇంట్లో నుండి భైక్ తీసుకొని వెళ్లిన అతను రాత్రి వరకు రాలేదని, వారం క్రితం ఇంట్లో చిన్నపాటి గొడవ అయిందన్నారు. అమాలి పని చేస్తున్న మా నాన్న ఇలా ఎందుకు శవంలా కనిపించాడని వాపోతున్నాడు. ఇక్కడకు వచ్చిన తారకేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. హ‌త్యా లేదా ఆత్మ‌హ‌త్యా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement