Sunday, May 5, 2024

మాస్క్ లేకుంటే జరిమానా..

కొల్చారం : ప్రభుత్వ ఆదేశానుసారం మాస్క్ లు ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెడ్‌కానిస్టేబుల్‌ ప్రకాష్‌ తెలిపారు. మెదక్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారి, ఏడుపాయలకు వెళ్లే రోడ్డు మార్గంలో వాహన తనిఖీ చేపట్టారు. ఈ వాహన తనిఖీలో మాస్కులు ధరించని వారికి, ఓవర్‌లోడ్‌, హెల్మెట్‌ దరించని వారికి జరిమానా విధించడం జరుగుతుందని ఆయన వెళ్లడించారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించి స్వీయనియంత్రణ పాటించాలని సూచించారు. ఈ తనిఖీలో పోలీస్‌ సిబ్బంది దత్తు, హరిక్రిష్ణ, శంకర్‌, జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement