Monday, April 29, 2024

ఏపీలో ఒక్కరోజులో 12 వేలు దాటిన కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకీ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 62,884 శాంపిల్స్ ని పరీక్షించగా 12,634 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1033560 కు చేరింది. అందులో 936143 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 89732 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 69 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7685 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 4,304 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 62,885 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement