Monday, May 20, 2024

కాలనీల అభివృద్ధికి పాటు పడండి..

పేట్‌బషీరాబాద్‌ : కాలనీల అభివృద్ధిలో సంక్షేమ సంఘం సభ్యులు భాగస్వాములు కావాలని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కేఎం. ప్రతాప్‌ అన్నారు. జీడిమెట్ల డివిజన్‌ పరిధిలోని శివారెడ్డి నగర్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికలలో నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన చింత పల్లి వెంకటేశ్వర్లు, వారి కార్యవర్గం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీలో నెలకొన్న సమస్య గురించి ప్రతాప్‌కి విన్నవించగా శివారెడ్డి వెల్పేర్‌ కమిటీకి, కాలనీవాసులకు అందుబాటులో ఉంటానని హమీనిచ్చారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement