Tuesday, May 14, 2024

ఇంటింటా జెండా ఎగ‌రేద్దాం : మంత్రి హరీశ్‌ రావు

సిద్దిపేట : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. మంత్రి స్వయంగా ఇంటింటికి తిరిగి జెండా ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ జెండాను ఆగస్టు 15న ఇంటిపై ఎగరేయాలని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజా శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, గ్రామ సర్పంచ్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement